Ramon Magsaysay Awards 2024

Ramon Magsaysay Awards 2024 రామన్ మెగ సెసె అవార్డు 2024


2024 సంవత్సరానికి గానూ ప్రముఖ జపాన్ యానిమేటర్ హయానో మియాజాకీని రామన్ మెగసెసె అవార్డు వరించింది.


ఆయనతో పాటు వియత్నాం డాక్టర్ న్దుయెన్, మాజీ బౌద్ధ సన్యాసి కర్మ ఫుంటా, ఇండోనేషియాకు చెందిన ఫర్వీజీ ఫర్హాను మరియు థాయ్ లాండ్ కు చెందిన రూరల్ డాక్టర్స్ మూమెంట్ సంస్థకు ఈ పురస్కారం దక్కింది.


ఈ ఏడాది నవంబర్లో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం అవార్డు నిర్వాహక కమిటీ చేయనుంది.


రామన్ మెగసెసే అవార్డు గురించి:


ఫిలిప్పీన్స్ దివంగత అధ్యక్షుడు రామన్ మెగ సెసే స్మారకార్థం ఈ అవార్డును ఏప్రిల్, 1957లో ఏర్పాటు చేశారు. దీనిని "ఆసియన్ నోబెల్ ప్రైజ్"గా భావిస్తారు.


ఈ అవార్డును 6 విభాగాల్లో 1958 నుంచి 2008వరకు అందజేసేవారు. అయితే, 2009 సంవత్సరం నుండి, రామన్ మెగసెసే అవార్డు ఫౌండేషన్ పైన పేర్కొన్న ఆరు విభాగాలలో అవార్డును ప్రదానం చేసే పద్ధతిని తొలగించింది.

Nuziveedu IIIT issue Removal of Director

Nuziveedu IIIT issue Removal of Director Minister Lokesh Fires on Nuziveedu Triple IT Incident - Removal of Director - Lokesh on Nuziveedu IIIT issue నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ పై వేటు.. విద్యార్థుల అస్వస్థతపై.. మంత్రి లోకేశ్ ఆగ్రహం


నూజివీడు ట్రిపుల్ఎటీలో కలుషితాహారం తిని పెద్ద సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యానికి గురైన ఉదంతాన్ని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా పరిగణించారు.


విద్యార్థుల ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ట్రిపుల్ఎటీ డైరెక్టర్ చంద్రశేఖర్ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ నిట్ ఆచార్యుడైన చంద్రశేఖర్ను గత ప్రభుత్వం ఇక్కడ డైరెక్టర్గా నియమించింది. మరోపక్క, ట్రిపుల్ఎటీ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పాదుకొల్పే చర్యల్లో భాగంగా పర్యవేక్షణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. కళాశాల విద్య కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జి ఛైర్మన్ రామమోహన్రావు, ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వీ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఆహార నాణ్యత, కొన్ని సున్నితమైన అంశాలపై ఫిర్యాదుల స్వీకరణ, ఇతరత్రా సమస్యల తక్షణ పరిష్కారానికి ఈ కమిటీ ప్రణాళికను రూపొందించాలని మంత్రి లోకేశ్ సూచించారు.


త్రిసభ్య కమిటీ బాధ్యతలివే..


• విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం, మెస్లో పరిశుభ్రత చర్యల కోసం ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొటోకాల్ అమలు, వసతిగృహాల్లో మెరుగైన ప్రమాణాల అమలుకు చర్యలు తీసుకోవడాన్ని ఈ కమిటీ పరిశీలించనుంది.


• ట్రిపుల్ఎటీ అవసరాల మేరకు చిన్నచిన్న మరమ్మతులు చేయడం, లైంగిక వేధింపులపై ఫిర్యాదుల పరిష్కారానికి అంతర్గత కమిటీ వేయడం, ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా విచారణ చేపట్టి సత్వరం చర్యలు తీసుకోవడం, ప్రతి డిపార్టుమెంట్ స్థాయిలో తగిన యంత్రాంగాన్ని ఏర్పాటుచేసి డ్రగ్, పొగాకు రహితంగా తీర్చిదిద్దడంపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించనుంది.


• విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించడం, జీవన నైపుణ్యానికి చర్యలు తీసుకోవడం, కళాశాల వెల్నెస్ టీమ్ ఏర్పాటును కమిటీ పరిశీలిస్తుంది.


వెల్నెస్ టీమ్ లో విద్యార్థి సంక్షేమ డీన్, ఇద్దరు సీనియర్ అధ్యాపకులు సభ్యులుగా, ప్రతి విభాగం నుంచి విద్యార్థి మానిటర్లు, తల్లిదండ్రులు ప్రతినిధులుగా ఉంటారు.

యూపీఐ సర్కిల్ సదుపాయాన్ని లాంచ్ చేసిన గూగుల్ పే

యూపీఐ సర్కిల్ సదుపాయాన్ని లాంచ్ చేసిన గూగుల్ పే


ఎన్పీసీఐ ఇటీవల ప్రకటించిన యూపీఐ సర్కిల్ సదుపాయాన్ని గూగుల్ పే తీసుకొచ్చింది. దీంతో యూపీఐని ఇతరులతో పంచుకోవచ్చు.


గూగుల్ కు చెందిన చెల్లింపు సేవల సంస్థ గూగుల్ పే (Google pay) యూపీఐ సర్కిల్ (UPI Circle) ఫీచర్ ను ప్రారంభించింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో తమ యూపీఐ అకౌంట్ను వాడుకునే సదుపాయం కల్పిస్తోంది. అవతలి వ్యక్తులకు బ్యాంకు ఖాతా లేకపోయినా దీన్ని వాడుకోవచ్చు. ముంబయి వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఫిన్టిక్ ఫెస్ట్ 2024లో భాగంగా యూపీఐ సర్కిల్తో పాటు మరికొ ఫీచర్లను తీసుకొచ్చింది.


యూపీఐ సర్కిల్ కోసం గూగుల్ పే ఎన్పీసీఐతో జట్టు కట్టింది. ఈ సదుపాయం ద్వారా ఇతరులకు పాక్షికంగా లేదా పూర్తి డెలిగేషన్ ఇవ్వొచ్చు. ఇదే వేదికపై ఈ-రూపీ సేవలను కూడా ఆవిష్కరించింది. రూపే కార్డులు కలిగి ఉన్న వారికి ట్యాప్ అండ్ పే పేమెంట్స్ సదుపాయం కూడా ప్రకటించింది. దీని ద్వారా రూపే కార్డు హోల్డర్లు మొబైల్ ద్వారా ట్యాప్ చేసి పే చేయొచ్చు. అలాగే, యూపీఐ లైట్లో ఆటోపే ఆప్షన్ను కూడా తీసుకొచ్చింది. 9



యూపీఐ సర్కిల్ ఎలా పని చేస్తుంది?

ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు తమ మొబైల్లో యూపీఐ సేవలను వాడుకునే వీలుంది. అయితే, ఎవరి యూపీఐని వారే వాడుకోవాలి. వేరొకరు వాడేందుకు అనుమతి లేదు. కొత్తగా తీసుకొచ్చిన యూపీఐ సర్కిల్లో అది సాధ్యం కానుంది. ప్రైమరీ యూపీఐ అకౌంట్ను కుటుంబ సభ్యులు, పరిచయం ఉన్న వ్యక్తులతో పంచుకునే వెసులుబాటును కల్పిస్తోంది. అంటే ఒకరి బ్యాంక్ అకౌంట్ను వేరొకరు వినియోగించి లావాదేవీలు జరపొచ్చన్నమాట. గరిష్ఠంగా ఐదుగురితో యూపీఐని పంచుకోవచ్చు.

The minimum marriage age for women in Himachal Pradesh

The minimum marriage age for women in Himachal Pradesh is now 21 years.  It is a crime to marry women below the prescribed age.


హిమాచల్ ప్రదేశ్ లో ఇక పై మహిళల కనీస వివాహ వయసు 21 సంవత్సరాలు. నిర్దేశిత వయసు కంటే తక్కువ వయసున్న మహిళలకు పెళ్లి చేస్తే నేరం అవుతుంది.


లింగ సమానత్వం, ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కల్పించేందుకు మహిళ కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ రూపొందించిన బిల్లుకు బుధవారం(28.08.2024)న ఆమోదం తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీ బాల్య వివాహాల నిషేధాన్ని (హిమాచల్ ప్రదేశ్ సవరణ బిల్లు 2024) వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది.


ఈ మేరకు బాల్య వివాహాల నిషేధ చట్టం- 2006 స్థానంలో బాల్య వివాహాల (హిమాచల్ ప్రదేశ్) నిషేధ సవరణ-2024 చట్టం తీసుకొచ్చారు.


రాష్ట్రంలో బాల్య వివాహ చట్టం 2006, సంబంధిత చట్టాలను సవరించి, బాలికల కనీస వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదన చేశారు.


2006 నాటి చట్టం ప్రకారం మహిళల కనీస వివాహ వయసు 18 ఏళ్లు కాగా, పురుషుల కనీస వివాహ వయసు 21 ఏళ్లుగా ఉంది.

IMMS TMF Uploading the toilet photos

IMMS TMF Uploading the toilet photos Uploading the toilet photos in IMMS APPTMF Standard Operating Procedure HMs, EWA, SMC Roles Survey Format for Headmasters / EWA TMF-Standard Operating Procedure (SOP) Role of Head Master/Education Welfare Assistant/Ward Education Secretary/ School Management Committee Members


School Education- TMF-Standard Operating Procedure (SOP) Role of Head Master/Education Welfare Assistant/Ward Education Secretary/ School Management Committee Members -Regarding Memo No. ESE02-1769330/69/2022-MDM-CSE Dt:16/08/2024


Ref: This Office Memo ESE02-27021/69/2022-MDM-CSE Dt:30-06-2022.


The attention of all Regional Joint Directors of School Education and District Educational Officers in the state are informed that, The Government of Andhra Pradesh have setup the Toilet Maintenance Fund (TMF) for maintaining the cleanliness of the Toilets, Urinals, dress change room, washbasins and other associated items of the toilet complexes in all the government schools and all the Government Junior Colleges in Rural and Urban areas for safeguarding the health of all the students. The monitoring of the scheme may be done through IMMS APP by following revised SOP norms as follows:-


Role of Head Master:-

  • Head Master need not upload the toilet photos in IMMS APP. 
  • A survey form shall be provided to the Head Masters which is to the uploaded in IMMS APP. 
  • Head Master has to update the survey format in IMMS APP once in a day i.e., Evening hours. Note:-Survey format for headmasters is enclosed.

Role of Education Welfare Assistant/Ward Education Secretary:

  • Education and Welfare Assistant shall visit the schools two times in a week i.e., Monday & Thursday.
  • He/ She shall upload the toilet photos in IMMS/CR APP during their visit
  • Observe cleanliness of toilets, wash basins, urinals and other associated items and upload remarks and photos in the IMMS/CR app.

Role of School Management Committee Members:-

  • Necessary logins of IMMS APP are provided to SMC Chairman and its members.
  • SMC members may visit the schools every Wednesday and Friday. 
  • They may also be requested to upload the toilet photos in IMMS APP.

There fore, all the district Educational Officers in the state are requested to issue necessary instructions to filed functionaries so as to enable effective monitoring on the implementation of Toilet Maintenance Fund(TMF).


🖋️ IMMS App లో ప్రధానోపాధ్యాయులు రోజూ టాయిలెట్ ఫోటోలు తీనవసరం లేదు 

కానీ ప్రతి సోమవారం మరియు గురువారం వారి గ్రామ సచివాలయ EWA పాఠశాలను సందర్శించి  టాయిలెట్ ఫొటోస్   తీసేలా పర్యవేక్షించాలి...


 🖋️ అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ  చైర్మన్/  వైస్ చైర్మన్  / సభ్యులు  గానీ ప్రతి బుధవారం మరియు శుక్రవారం  

పాఠశాలను సందర్శించి  టాయిలెట్ ఫొటోస్ తీసేలా పర్యవేక్షించాలి...


 🖋️ ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ మధ్యాహ్నం   3:00 నుండి 3:30 మధ్యలో తప్పనిసరిగా ఇన్స్పెక్షన్ ఫామ్ ఫిల్ చేసి Remarks సబ్మిట్ చేయాలి.


Remarks వద్ద 

===================

```Maintaining in Good Condition``` 

===================

అని టైప్ చేసి సబ్మిట్ చెయ్యాలి.


A copy of Survey format for headmasters is enclosed.


Encl: Survey format


Download EWAS_IDs  | SMC IDs


Download TMF SOP | Download Survey format

Change of names of the Government Schemes being implemented in School Education

School Education Department - Change of names of the Government Schemes being implemented in School Education Department during 2019- 2024-Certain-Instructions-Issued- Regarding Memo No. ESE02-2532125/25/2024-MDMCSE, Dt: 22/08/2024


Ref:- G.O.Rt.No.326 SCHOOL EDUCATION (GENERAL) DEPARTMENT Dt: 06-08- 2024.


All the Regional Joint Directors of School Education and District Educational Officers in the State are here by informed that in the reference cited the Government have issued orders changing the names of the Government Schemes being implemented in School Education Department as detailed below:




Further they are here by informed that the following schemes are related to the Directorate, MDM &SS among the above said Schemes:



జగనన్న అమ్మఒడి ఇకపై ' తల్లికి వందనం', జగనన్న విద్యాకానుక పేరు 'సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర'గా.. జగనన్న గోరు ముద్ద పేరు ' డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం'గా, మన బడి నాడు-నేడు పేరును ' నబడి- మన భవిష్యత్తు'గా, స్వేచ్ఛ పథకం పేరును 'బాలికా రక్ష'గా జగనన్న ఆణిముత్యాలు పేరును 'అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం'గా మార్పు.


Therefore all the Regional Joint Directors of School Education and District Educational Officers in the State are requested to issue necessary instructions to all the field functionaries of their jurisdiction regarding “Dokka Seethamma Madhyhna Badi Bhojanam” and “Ballika Raksha” and also requested to give wide publicity in this regard.


Download Scheme Change G.O 326 copy


Download School Education Memo Copy


AP State Fake Universities

AP State Fake Universities declared by UGC: ఏపి రాష్ట్రంలో రెండు నకిలీ విశ్వవిద్యాలయాలు - యూజీసీ ప్రకటన


దేశవ్యాప్తంగా 21 నకిలీ వర్సిటీలు ఉన్నట్లు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ప్రకటించింది. 

వాటిలో ఏపీకి సంబంధించి గుంటూరు కాకుమానివారితోటలోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ విశ్వవిద్యాలయం, విశాఖపట్నంలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఉన్నాయి. 

నకిలీ వర్సిటీలకు డిగ్రీలు ప్రదానం చేసే అధికారం లేదు. ఈ విద్యా సంస్థలు ఇచ్చిన ధ్రువపత్రాలు చెల్లుబాటు కావు. 

యూజీసీ నకిలీ విశ్వవిద్యాలయాలను ప్రకటిస్తున్నా, ఉన్నత విద్యాశాఖ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. కనీసం వాటి యజమానులను పిలిచి మాట్లాడిన దాఖలాలే లేవు. 

విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో తమిళనాడు, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కొన్ని వర్సిటీల పేర్లతో కోర్సులు నిర్వహిస్తున్నారు. 

వన్ సిట్టింగ్లోనే డిగ్రీ ఇస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. 

నకిలీ వర్సిటీల గురించి తెలియని చాలామంది విద్యార్థులు వాటిల్లో ప్రవేశాలు పొందుతున్నారు. తీరా చదివిన తర్వాత ఆ ధ్రువపత్రాలు చెల్లవని చెబుతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. 

ఇప్పటికైనా ఉన్నత విద్యా శాఖ, ఉన్నత విద్యా మండలి నకిలీ విశ్వవిద్యాలయాల పై దృష్టిపెట్టాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now